Apple PodcastsSpotifyGoogle Podcasts

  • అనువాదకులు లక్ష్మణ శాస్త్రి –  ‘నా పేరు గౌహర్ జాన్’ నవల గురించి  
    అనువాదకులు లక్ష్మణ శాస్త్రి –  ‘నా పేరు గౌహర్ జాన్’ నవల గురించి  

    గుంటూరు కుమార లక్ష్మణ శాస్త్రి గారు.  ఎల్ ఐ సీ లో అధికారిగా పనిచేస్తున్నారు. హిందుస్తానీ సంగీతం మీద ప్రత్యేకమైన ఆసక్తి  వుంది. పుస్తకపఠనం అనువాదం  ఇతర అభిరుచులు  కాకినాడ వాస్తవ్యులు. ఆంగ్ల రచయిత విక్రమ్ సంపత్ రచించిన‘ మై నేమ్  ఈస్ గౌహర్ జాన్’ ‘బ్రేవ్ హార్ట్స్ ఆఫ్ భారత్’  రెండిటినీ ఇంగ్లీష్ నించి తెలుగులోకి అనువదించి గోదావరి ప్రచురణల ద్వారా అందుబాటులోకి తీసుకొస్తున్నారు. హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో  విక్రమ్ సంపత్ సమక్షంలో ఈ…

  • సాయి వంశీ – ‘మైక్రో కథలు’
    సాయి వంశీ – ‘మైక్రో కథలు’

    సాయి వంశీ యువ రచయిత మంచి చదువరి. ఆయన  రాసిన మైక్రో కథలు అనే తన మొదటి పుస్తకం ఈ మధ్యనే రిలీజ్ అయ్యింది. కథలు రాయడం చదవడం కాకుండా సారంగ వెబ్ పత్రిక లో ‘కథల పొద్దు’ అనే శీర్షిక ద్వారా వంశీ యువరచయితలను పరిచయం  చేస్తారు. తాను చదివిన పుస్తకాలను విశదంగా ఫేస్బుక్ ద్వారా పరిచయం చేస్తారు. ఈ ఎపిసోడ్ లో ‘మైక్రో కథలు’ పుస్తకం గురించి, సమకాలీన తెలుగు కథాసాహిత్యం గురించి వంశీ…

  • ‘ హర్షాయణం’ గురించి హర్షతో  ‘అజు’ మల్లికార్జున్ 
    ‘ హర్షాయణం’ గురించి హర్షతో  ‘అజు’ మల్లికార్జున్ 

    హర్షణీయం పాడ్కాస్ట్ హర్షవర్ధన్ – మొదటి కథల పుస్తకం ‘హర్షాయణం’. ఈ నెల పదవ తారీఖున ‘అజు’ పబ్లికేషన్స్ ద్వారా విడుదల అవుతుంది. ఈ సందర్భంగా హర్ష తో రచయిత పబ్లిషర్ మల్లికార్జున్ చేసిన సంభాషణ.  పుస్తకం హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో అజు స్టాల్ లో లేదా అమెజాన్ లో ఫిబ్రవరి పదవ తారీఖు నించీ లభిస్తుంది. 

  • హర్షణీయంలో పి.సత్యవతి గారు
    హర్షణీయంలో పి.సత్యవతి గారు

    పి.సత్యవతి 1940 జూలైలో గుంటూరు జిల్లా, కొలకలూరులో జన్మించారు.  ఆంగ్ల సాహిత్యంలో పట్టభద్రులు.  ఆంగ్ల అధ్యాపకురాలుగా వృత్తిని చేపట్టి పదవీ విరమణ చేశారు. ప్రత్యేకంగా కథాప్రక్రియలో కృషి చేశారు. చాసో స్ఫూర్తి అవార్డును, సాహిత్య  అకాడెమీ అనువాదం అవార్డునీ, కువెంపు జాతీయ అవార్డునీ , పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ విశిష్ట పురస్కారాలను అందుకున్నారు. 2016 లో విశాలాంధ్ర పబ్లిషర్స్ 40 కథలతో వీరి కథా సంకలనం ప్రచురించింది. సాహిత్యంవైపు తనను మళ్ళించిన పరిస్థితుల గురించీ, చదివే పుస్తకాలగురించీ, తన రచనల గురించీ ఈ సంభాషణలో భాగంగా సత్యవతి…

  • రచయిత మెహెర్ – ‘పడి మునకలు’
    రచయిత మెహెర్ – ‘పడి మునకలు’

    ఈ ఎపిసోడ్లో రచయిత మెహెర్ తన సాహితీ వ్యాసాల సంకలనం ‘పడి మునకలు’ పుస్తకం గురించి మనతో మాట్లాడారు. తెలుగులో మనకున్న విలక్షణమైన రచయిత. తూర్పుగోదావరి మండపేటలో జన్మించారు. జర్నలిస్టుగా ఆంధ్రజ్యోతిలో పని చేస్తున్నారు. 2007లో బ్లాగు మొదలుపెట్టి కథలు రాస్తున్నారు. ఆయన రచించిన 2019లో ‘చేదుపూలు’ కథా సంపుటి, ‘మెటమార్ఫసిస్ – ఇంకొన్ని కథలు’ కాఫ్కా రచనల అనువాదం విడుదలయ్యాయి. 2023లో ‘పడి మునకలు’ నాన్ ఫిక్షన్ పుస్తకం విడుదలైంది. తనకు ఇష్టమైన రచయితల గురించి,…

  • ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు గారి గురించి ఉప్పులూరి కామేశ్వర రావు గారు
    ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు గారి గురించి ఉప్పులూరి కామేశ్వర రావు గారు

    మహామహోపాధ్యాయ ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు ఆంధ్రీకరించిన వాల్మీకి రామాయణానికి తెలుగులో ప్రత్యేకమైన స్థానం వుంది. రామాయణంపై తెలుగులో వచ్చిన గ్రంథాలలో శ్రీరామచంద్రుడు గారు చేసిన అనువాదం  ప్రామాణికంగా చెప్పబడుతుంది. సంస్కృతం, తెలుగు , హిందీ లలో విశేషమైన ప్రతిభ  కలిగిన శ్రీరామచంద్రుడు 1966 లో సంస్కృతంలో పీహెచ్డీ పట్టా పొందారు. తెలుగు, ఆంగ్ల, సంస్కృత భాషల్లో రెండువందల పైగా రచనలు చేశారు. 2011 లో పద్మశ్రీ అవార్డును స్వీకరించారు. ఈ ఎపిసోడ్ లో ఆయనతో ప్రత్యేకమైన సాన్నిహిత్యం కలిగిన…

  • ‘ప్రపంచ సినిమా చరిత్ర’ – అరిపిరాల సత్యప్రసాద్ గారితో సంభాషణ
    ‘ప్రపంచ సినిమా చరిత్ర’ – అరిపిరాల సత్యప్రసాద్ గారితో సంభాషణ

    అరిపిరాల సత్యప్రసాద్ గారు , ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ రూరల్ మానేజ్మెంట్, ఆనంద్ లో చదువుకున్నారు. గుంటూరు స్వస్థలం. ప్రస్తుతం ఐ డీ ఎఫ్ సీ ఫస్ట్ భారత్ లిమిటెడ్ లో, లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ డివిజన్ కి జనరల్ మేనేజర్ గా పని చేస్తున్నారు. జరుగుతున్నది జగన్నాటకం’ , ‘రూపాయి చెప్పిన బేతాళ కథలు’ ఆయన రచనలు. కథల మీద, నవల మీద సమీక్షావ్యాసాలు రాస్తుంటారు. కొన్ని కథా సంకలనాలకు సంపాదకత్వం వహించారు. లఘుచిత్రాలను తీశారు.…

  • నిత్య యాత్రీకుడు ఆదినారాయణ గారితో పరిచయం
    నిత్య యాత్రీకుడు ఆదినారాయణ గారితో పరిచయం

    ప్రకాశం జిల్లాకు చెందిన ఆదినారాయణ గారు ఆంధ్రా యూనివర్సిటీ ఫైన్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్ లో ప్రొఫెసర్ గా పని చేసి రిటైర్ అయ్యారు. గత నాలుగు దశాబ్దాలుగా ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు సందర్శించి, తన యాత్రల గురించి పుస్తకాలను రాస్తున్నారు. భారతదేశం అంతా తన కాలినడకన తిరిగి ‘భ్రమణ కాంక్ష’ అనే పుస్తకాన్ని ప్రచురించారు. ఆరు ఖండాలలోని ముప్ఫయి ఐదు దేశాలలో తిరిగి ‘భూ భ్రమణ కాంక్ష’ అనే పుస్తకాన్ని రాసారు. తెలుగులో మొదటి యాత్రా…

  • సాహిత్యంలో కృత్రిమ మేధ (Artificial Intelligence) – వి బి సౌమ్య గారు.
    సాహిత్యంలో కృత్రిమ మేధ (Artificial Intelligence) – వి బి సౌమ్య గారు.

    ఈ ఎపిసోడ్ లో సంభాషించిన  వి.బి. సౌమ్య గారు  Natural Language Processing (NLP) లో  PhD చేసారు. ప్రస్తుతం కెనడాలోని  నేషనల్ రీసెర్చ్ కౌన్సిల్‌లో పని చేస్తున్నారు. అనువాదకురాలు, రచయిత.  కొండపల్లి కోటేశ్వరమ్మ గారి ఆత్మకథ “నిర్జన వారధి” ని “ది షార్ప్ నైఫ్ ఆఫ్ మెమరీ” గా ఆంగ్లంలోకి – సత్యజిత్ రే వ్రాసిన Our Films, Their Films ను తెలుగులోకి అనువదించారు. pustakam.net అనే వెబ్సైటు నిర్వహిస్తున్నారు. ఈ సంభాషణలో భాగంగా,…

  • నవోదయ బుక్ హౌస్  –  హర్షణీయంలో
    నవోదయ బుక్ హౌస్ – హర్షణీయంలో

    నవోదయ బుక్ హౌస్ ని సాంబశివరావు గారు , కోటేశ్వర రావు గారు కలిసి, కాచిగూడ హైదరాబాద్ లో స్థాపించి, గత మూడు దశాబ్దాల పైబడి తెలుగు పుస్తకాలను పాఠకులకు అందచేస్తున్నారు. నవోదయ పబ్లిషింగ్ ద్వారా మంచి సాహిత్యాన్ని ప్రచురిస్తున్నారు. ఈ ఎపిసోడ్ లో సాంబశివరావు గారు పుస్తకాలతో తనకున్న దాదాపు యాభై ఏళ్ళ సాన్నిహిత్యాన్ని, అమ్మకంలో , ప్రచురణలో తన అనుభవాలను మనతో పంచుకున్నారు.ఎపిసోడ్ చివరన కోటేశ్వర రావు గారు కూడా పాల్గొనటం జరిగింది. వారికి…

  • తెలుగు వారి తమిళ కథలు – ‘తెన్నాటి తెమ్మెర’ కథాసంకలనం గురించి స.వెం. రమేష్ గారితో.
    తెలుగు వారి తమిళ కథలు – ‘తెన్నాటి తెమ్మెర’ కథాసంకలనం గురించి స.వెం. రమేష్ గారితో.

    ఈ ఎపిసోడ్ లో శ్రీ. స. వెం. రమేశ్ తాను సేకరించి సంపాదకీయం వహించిన ‘తెన్నాటి తెమ్మెర’ కథాసంకలనాన్ని మనకు పరిచయం చేస్తారు. ఈ కథలన్నీ కూడా తెలుగు మూలాలున్న తమిళ రచయితలు రాసినవి. తమిళ మూల కథలను రమేశ్ గారే తెలుగు లోకి అనువదించారు.

  • ‘పల్లవి పబ్లికేషన్స్’ వెంకట నారాయణ గారితో హర్షణీయం
    ‘పల్లవి పబ్లికేషన్స్’ వెంకట నారాయణ గారితో హర్షణీయం

    ‘పల్లవి’ వెంకట నారాయణ గారు, గత ఐదు దశాబ్దాలుగా, పుస్తక ప్రచురణా రంగంలో వున్నారు. పల్లవి పబ్లికేషన్స్ సంస్థ అధినేత. విజయవాడ వాస్తవ్యులు. ఈ ఇంటర్వ్యూ లో ఆయన గత యాభై ఏళ్ళుగా తెలుగు పుస్తక ప్రచురణ, విక్రయాల్లో వచ్చిన మార్పులు, ఇబ్బందులు, తదితర విషయాల గురించి విస్తారంగా మాట్లాడారు. వారికి హర్షణీయం కృతఙ్ఞతలు.

  • తేజో-తుంగభద్ర నవల గురించి రచయిత వసుధేంద్ర తో సంభాషణ (Conversation with Vasudhendra)
    తేజో-తుంగభద్ర నవల గురించి రచయిత వసుధేంద్ర తో సంభాషణ (Conversation with Vasudhendra)

    కన్నడలో అనేక కథాసంకలనాలు, వ్యాసాలతో పాటు రెండు నవలలు రచించారు వసుధేంద్ర. కర్ణాటక సాహిత్య అకాడమీ బహుమతి, యు ఆర్ అనంతమూర్తి అవార్డులతో పాటు ఎన్నో ప్రశంసలు పురస్కారాలు అందుకున్నారు. ఆయన రాసిన తేజో తుంగభద్ర నవల, 1490 – 1520 సంవత్సరాలలో  పోర్చుగల్ దేశం, విజయనగర సామ్రాజ్యంలో జరిగిన కొన్ని సంఘటనలను ఆధారంగా చేసుకుని రచింపబడింది. ఇప్పుడు తెలుగులో రంగనాధ రామచంద్ర రావు గారి అనువాదంతో, ఛాయా పబ్లిషర్స్ ద్వారా మీ ముందుకు వచ్చింది. పోర్చుగల్…

  • బతుకు సేద్యం నవలాపరిచయం
    బతుకు సేద్యం నవలాపరిచయం

    బతుకు సేద్యం –  జహీరాబాద్ చుట్టుపక్కల గ్రామాల్లో నివసిస్తున్న గ్రామీణ మహిళల   గురించి, ఒక ప్రభుత్వేతర సంస్థ సహాయంతో వారి జీవితాలను వారు  కష్టపడి ఎలా సరిదిద్దుకున్నారో, వివరిస్తూ రాసిన పుస్తకం. యదార్థ సంఘటనలనాధారం చేసుకుని రాసిన కాల్పనిక నవల. ఎపిసోడ్ లో ముందుగా ఛాయా మోహన్ గారు మాట్లాడతారు. తర్వాత రచయిత శాంతి ప్రభోదిని గారు నవల గురించి మరిన్ని వివరాలు అందిస్తారు.

  • ‘చెఖోవ్ కథలు – 1’ పుస్తకం, అనువాదకులు అరుణ గారితో పరిచయం
    ‘చెఖోవ్ కథలు – 1’ పుస్తకం, అనువాదకులు అరుణ గారితో పరిచయం

    ‘Father of Modern short story’ అని చెప్పబడే రష్యన్ రచయిత చెఖోవ్ , 1880 – 1905 ప్రాంతంలో ఆరువందలకు పైగా కథలను రాసారు. ఈయన కథలు ప్రపంచ వ్యాప్తంగా. అనేక భాషల్లో అనువదించబడి ప్రాచుర్యాన్ని పొందాయి. ఇంగ్లీష్ నించి చెఖోవ్ కథలను తెలుగులోకి అనువదించి మన ముందుకు తెస్తున్నారు శ్రీమతి అరుణ గారు. ఈ పుస్తకం గురించి ఈ ఎపిసోడ్ లో ఆమె మనకు వివరిస్తారు. ఎపిసోడ్లో ముందుగా ఈ పుస్తకాన్ని మనకు అందిస్తున్న…

  • ‘పార్వేట’ రచయిత సురేంద్ర శీలంతో సంభాషణ
    ‘పార్వేట’ రచయిత సురేంద్ర శీలంతో సంభాషణ

    కర్నూల్ జిల్లా కోవెలకుంట్ల ప్రాంతానికి చెందిన, ఇంజనీరింగ్ చదివిన, ఇరవై తొమ్మిదేళ్ళ సురేంద్ర శీలం రాసిన కథల పుస్తకం – పార్వేట’. గత మూడేళ్ళ క్రిందటే తెలుగు కథలు చదవడం రాయడం మొదలు పెట్టిన ఈ రచయిత మొదటి పుస్తకం ఇది. కథలన్నీ ఆ ప్రాంతపు మాండలికంలో రాసినవే. మాండలికం వాడిన పద్ధతి చదువుకోడానికి ఎక్కడా అడ్డం రాలేదు, అందాన్నిచ్చింది. అక్కడి గ్రామీణ జీవితాన్ని, సమస్యలనీ చక్కటి పాత్రలను సృష్టించడం ద్వారా మన ముందుకు తెచ్చారు రచయిత.…

  • ‘దేవుడమ్మ మరో పది కథలు’ – రచయిత్రి ఝాన్సీ గారితో సంభాషణ
    ‘దేవుడమ్మ మరో పది కథలు’ – రచయిత్రి ఝాన్సీ గారితో సంభాషణ

    ఝాన్సీ గారు రాసిన మొదటి కథల పుస్తకం ‘దేవుడమ్మ మరో పది కథలు’ ఈ మధ్యనే అందుబాటులోకి వచ్చింది. ‘లా’ లో డిగ్రీ తీసుకున్న ఝాన్సీ గారు, మాస్టర్స్ ఇన్ జర్నలిజం , మాస్టర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పూర్తిచేశారు. కొన్నాళ్ళు తిరుపతి లో ఆంధ్రజ్యోతి – స్టాఫ్ రిపోర్టర్ గా పని చేసి, ప్రస్తుతం ఒక ఐటీ కంపెనీని నడుపుతూ బెంగుళూరులో నివాసం వుంటున్నారు. అమెజాన్ ద్వారా పుస్తకం కొనడానికి ఈ లింకుని ఉపయోగించండి. –…

  • ‘East Wind’ పుస్తక పరిచయం – ఉణుదుర్తి సుధాకర్ గారితో
    ‘East Wind’ పుస్తక పరిచయం – ఉణుదుర్తి సుధాకర్ గారితో

    ఉణుదుర్తి సుధాకర్ గారు రాసిన ‘తూరుపు గాలులు’ పుస్తకం సౌత్ సైడ్ బుక్స్ పబ్లిషింగ్ ద్వారా ఇంగ్లీష్ లో ‘East Wind’ పేరుతో అనువదించబడింది. ఈ అనువాద ప్రక్రియలో తన అనుభవాన్ని సుధాకర్ గారు మనతో పంచుకున్నారు, ఈ ఎపిసోడ్లో. త్వరలో ఈ పుస్తకం Hyderabad book trust వెబ్సైటు ద్వారా, ఇతర పుస్తక విక్రేతల ద్వారా లభ్యం అవుతుంది. ఆటా బహుమతి పొందిన ‘యారాడకొండ’ నవలా రచయిత శ్రీ . ఉణుదుర్తి సుధాకర్. వృత్తి రీత్యా…

  • ‘డిస్టోపియా’ కథలు – రచయిత్రి శ్రీసుధ గారితో పరిచయం
    ‘డిస్టోపియా’ కథలు – రచయిత్రి శ్రీసుధ గారితో పరిచయం

    గుంటూరు జిల్లాకి చెందిన శ్రీసుధ మోదుగు, వైద్యరంగంలో పనిచేస్తున్నారు. జమైకాలో నివాసం. ‘అమోహం’, ‘విహారి’, వీరి కవితా సంకలనాలు. రెక్కల పిల్ల, డిస్టోపియా అనే కథాసంపుటాలను ప్రచురించారు. ‘అంతర్హిత’ అనే నవల ఈ మధ్యనే విడుదల అయింది. ‘డిస్టోపియా’ కొనడానికి కింది లింక్ ఉపయోగించండి. http://bit.ly/3wg2nUW

  • ‘రామగ్రామ నుంచి రావణలంక దాకా’ రచయిత సీతారామరాజు గారితో పరిచయం.
    ‘రామగ్రామ నుంచి రావణలంక దాకా’ రచయిత సీతారామరాజు గారితో పరిచయం.

    రామగ్రామ నుంచి రావణలంక దాకా’ నవల రచయిత సీతారామ రాజు గారి సొంత వూరు, పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయి గూడెం. రియల్ ఎస్టేట్ రంగంలో వున్నారు. నివాసం హైదరాబాద్. ఆరు వారాల క్రితమే రిలీజ్ అయిన ఈ నవల 800 ప్రతుల మించి అమ్మకాలు సాధించి పాఠకుల విశేష ఆదరణకు నోచుకుంది. పుస్తకం కొనడానికి కింది లింక్ ఉపయోగించండి – https://amzn.to/3EoRIMn Harshaneeyam on apple podcast https://apple.co/3K1vMdw

  • మధురాంతకం రాజారాం గారి కథలు, రచనా జీవితం పై మధురాంతకం నరేంద్ర గారు
    మధురాంతకం రాజారాం గారి కథలు, రచనా జీవితం పై మధురాంతకం నరేంద్ర గారు

    1993 వ సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి తన కథల పుస్తకానికి గెలుచుకున్న మధురాంతకం రాజారాం గారు తెలుగులో సుప్రసిద్ధ కథారచయిత. చిత్తూరు జిల్లాకు చెందిన రాజారాం గారు మూడు వందలకు పైగా కథలు రాసారు. వారి సమగ్ర కథాసంకలనం కిందటి వారం ఎమెస్కో పబ్లిషర్స్ వారు ప్రచురించారు. ఇందులో 295 కథలు ఐదు భాగాలలో ఇవ్వడం జరిగింది. ఈ ఎపిసోడ్లో మధురాంతకం నరేంద్ర గారు వారి నాన్న గారి కథల గురించి , రచనా…

  • ‘ఇసుక అద్దం’ శ్రీ వూహ గారితో సంభాషణ
    ‘ఇసుక అద్దం’ శ్రీ వూహ గారితో సంభాషణ

    శ్రీ వూహ గారి మొదటి కథా సంపుటం ‘ఇసుక అద్దం’డిసెంబర్ నెలలో రిలీజ్ అయ్యింది. ఈ ఎపిసోడ్ లో తన కథారచన గురించి, తనను ప్రభావితం చేసిన విషయాల గురించి శ్రీ వూహమాట్లాడారు. ఇసుక అద్దం కొనడానికి క్రింది లింక్ ను ఉపయోగించండి.

  • యువ రచయిత వెంకట నారాయణ గారితో పరిచయం
    యువ రచయిత వెంకట నారాయణ గారితో పరిచయం

    ఇరవై మూడేళ్ళ వెంకటనారాయణ పల్నాడు జిల్లా గరికపాడు గ్రామానికి చెందిన వారు. ఎం ఏ తెలుగు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో పూర్తి చేశారు. ‘భూమి పతనం’ అనే నవల, ‘ఇయ్యాల మా వూళ్ళో’ అనే కవితా సంకలనం గత సంవత్సరం ప్రచురితమయ్యాయి. మంచి చదువరి. ఈ రచయితలా రాసేదానికంటే ఎక్కువ చదువుతూ , తాను చదివిన పుస్తకాల గురించి చక్కగా అర్థవంతంగా మాట్లాడే రచయితలు చాలా అరుదు. ప్రస్తుతం ‘గరికపాటోడి కథలు’ అనే కథా సంపుటి…

  • రచయిత అజయ్ ప్రసాద్ గారితో సంభాషణ
    రచయిత అజయ్ ప్రసాద్ గారితో సంభాషణ

    తెలుగులో మనకున్న అత్యంత ప్రతిభావంతులైన రచయితలలో అజయ్ ప్రసాద్ గారు ఒకరు. హర్షణీయంతో చేసిన ఈ సంభాషణలో తన రచనా జీవితం గురించి , ఈ మధ్యే వచ్చిన ఆయన కథా సంపుటం ‘గాలి పొరలు’ గురించి ఆయన వివరించారు. ప్రకాశం జిల్లా అద్దంకి వారి సొంత వూరు. ప్రస్తుతం ఉద్యోగ రీత్యా హైదరాబాద్ లో వుంటున్నారు. మంచి చదువరి. చక్కటి రచయిత. గాలి పొరలు ఆయన రెండో కథా సంపుటం. పుస్తకం కొనడానికి కింది లింక్…

  • కవి , అనువాదకులు శ్రీ ముకుంద రామారావు గారితో  సంభాషణ
    కవి , అనువాదకులు శ్రీ ముకుంద రామారావు గారితో సంభాషణ

    అదే గాలి, అదే ఆకాశం, అదే నేల, అదే కాంతి, అదే నీరు …… కవిత్వాన్ని పాంచభౌతిక పదార్థంగా నిర్వచించి దేశ విదేశాల కవిత్వాన్ని స్వయంగా అనుభవించి పదిమందీ ఆస్వాదించడానికి అనువదించి అందిస్తున్న ముకుంద రామారావు స్వయంగా కవి. అనువాద రంగంలో ఆయన కృషి అనితర సాధ్యం. ‘శతాబ్దాల సూఫీ కవిత్వం’ ద్వారా సూఫీ తత్త్వ సారాన్ని కాచి తెలుగులోకి వడగట్టి పోశారు. నోబెల్ బహుమతి పొందిన కవుల కవిత్వ జీవిత విశేషాల్ని క్రోడీకరిస్తూ వారి విశిష్ట…

  • అనిల్ అట్లూరి గారితో సంభాషణ
    అనిల్ అట్లూరి గారితో సంభాషణ

    ఈ ఎపిసోడ్ లో రచయిత, అనువాదకులు, కాలమిస్ట్ అనిల్ అట్లూరి గారు తన సాహితీ జీవితం గురించి, పుస్తక ప్రచురణ రంగంలో వస్తున్న అనేక మార్పుల గురించి విస్తారంగా హర్షణీయంతో మాట్లాడారు. అనిల్ అట్లూరి గారి తండ్రి ప్రముఖ సినీ రచయిత, కథా రచయిత అట్లూరి పిచ్చేశ్వర రావు గారు. తల్లి చౌదరాణి గారు స్థాపించిన ‘రాణి బుక్ సెంటర్’ ద్వారా అనిల్ అట్లూరి తెలుగు పుస్తకాలను అనేక దశాబ్దాలు మద్రాసులోని పుస్తక ప్రేమికులకు అందించారు. అనిల్…

  • పతంజలి శాస్త్రి  గారి కి  జీవిత  సాఫల్య  పురస్కారం  !
    పతంజలి శాస్త్రి గారి కి జీవిత సాఫల్య పురస్కారం !

    అప్పాజోస్యుల విష్ణుభొట్ల కందాళం ఫౌండేషన్ (అజో – విభో – కందాళం ) 29 వ వార్షిక సందర్భంగా శ్రీ తల్లావజ్ఝల పతంజలి శాస్త్రి గారికి, ఆయన చేసిన సాహితీ కృషికి గుర్తింపుగా. ప్రతిభామూర్తి జీవితకాల సాధన పురస్కారాన్ని (PRATIBHAMURTHY LIFE TIME ACHIEVEMENT AWARD) జనవరి 9 వ తారీఖు 2021 న, కాకినాడలో ప్రదానం చేస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీ నండూరి రాజగోపాల్ గారు పతంజలి శాస్త్రి గారిపై ఆంధ్రజ్యోతి దిన పత్రిక కై…

  • పతంజలి  శాస్త్రి  గారి కథల్లో   పాఠకుడి  పాత్ర
    పతంజలి శాస్త్రి గారి కథల్లో పాఠకుడి పాత్ర

    అప్పాజోస్యుల విష్ణుభొట్ల కందాళం ఫౌండేషన్ (అజో – విభో – కందాళం ) 29 వ వార్షిక సందర్భంగా శ్రీ తల్లావజ్ఝల పతంజలి శాస్త్రి గారికి, ఆయన చేసిన సాహితీ కృషికి గుర్తింపుగా. ప్రతిభామూర్తి జీవితకాల సాధన పురస్కారాన్ని (PRATIBHAMURTHY LIFE TIME ACHIEVEMENT AWARD) జనవరి 9 వ తారీఖు 2021 న, కాకినాడలో ప్రదానం చేస్తున్నారు. ఈ సందర్భంగా వారి కథారచనపై హర్షణీయం సమీక్ష. కథలో పాఠకుడి పాత్ర “ నేను రాసేటప్పుడు అంతా…

  • ‘త్రిపుర’ గారి గురించి డాక్టర్  మూలా  సుబ్రహ్మణ్యం
    ‘త్రిపుర’ గారి గురించి డాక్టర్ మూలా సుబ్రహ్మణ్యం

    ఈ ఎపిసోడ్లో శ్రీ మూలా సుబ్రహ్మణ్యం గారు, ప్రసిద్ధ రచయిత త్రిపుర గారి గురించి మాట్లాడతారు. శ్రీ సుబ్రహ్మణ్యం VLSI ఆర్కిటెక్చర్ లో డాక్టరేట్ తీసుకుని, ప్రస్తుతం పాలక్కాడ్ ఐఐటీ లో పని చేస్తున్నారు. స్వతహాగా, చక్కటి కవి రచయిత . ,’ఆత్మనొక దివ్వెగా’ నవల , ‘సెలయేటి సవ్వడి’ కవితా సంపుటి వీరి ప్రసిద్ధ రచనలు.

  • ‘సమాంతరాలు’ పతంజలి శాస్త్రి గారి కొత్త  కథా సంపుటం
    ‘సమాంతరాలు’ పతంజలి శాస్త్రి గారి కొత్త కథా సంపుటం

    ప్రసిద్ధ రచయిత పతంజలి శాస్త్రి గారి ‘సమాంతరాలు’ కథాసంపుటం విడుదల సందర్భంగా , ఛాయా మోహన్ గారితో కలిసి , హర్షణీయం – పతంజలి శాస్త్రి గారితో చేసిన సంభాషణ , ఈ ఎపిసోడ్లో . పుస్తకం కొనడానికి ఈ లింక్ ఉపయోగించండి. (https://bit.ly/samantharaalu) . పుస్తకం, ఆడియో వెర్షన్ ‘ఆడియో బైట్స్’ యాప్ కు సబ్స్క్రయిబ్ చేసి వినవచ్చు. (https://audiobites.storytel.com/) . తెలుగులో మొదటిసారిగా, ఆడియో , ప్రింటెడ్ వెర్షన్స్ ఒకే సారి లభ్యం అవ్వడం, ‘సమాంతరాలు’…

  • రచయిత ఉణుదుర్తి సుధాకర్ గారితో సంభాషణ
    రచయిత ఉణుదుర్తి సుధాకర్ గారితో సంభాషణ

    ఆటా బహుమతి పొందిన ‘యారాడకొండ’ నవలా రచయిత శ్రీ . ఉణుదుర్తి సుధాకర్. వృత్తి రీత్యా మెరైన్ ఇంజనీర్ అయిన శ్రీ సుధాకర్ రాసిన ‘తూరుపు గాలులు’ కథాసంపుటం కూడా విశేష ఆదరణ పొందింది. ఇప్పుడు కొత్తగా రాసిన ఇంకో కథల పుస్తకం ‘ చలిచీమల కవాతు. హర్షణీయం టీం ఆయనతో జరిపిన ఇంటర్వ్యూ ఇప్పుడు మీ కోసం. ‘చలిచీమల కవాతు’ పుస్తకం కొనడానికి ఈ లింక్ ని ఉపయోగించండి – https://amzn.to/3BzBpsO హర్షణీయం ఇంటర్వ్యూ మీరుఎంతకాలంనించీకథలురాస్తున్నారు?…

  • స వెం రమేష్ గారితో హర్షణీయం
    స వెం రమేష్ గారితో హర్షణీయం

    స.వెం.రమేశ్ గారు జీవితమంతా తెలుగు భాషా ప్రాచుర్యానికే అంకితం చేసిన అపురూపమైన మనిషి. హర్షణీయంతో ఆయన మనం కోల్పోతున్న భాషా వైభవాన్ని సంస్కృతిని గురించి, మాట్లాడుతూ , ఈ ప్రయాణంలో తాను దాచుకున్న అనేక అనుభవాలను అనుభూతులను పంచుకున్నారు.

  • పుస్తక ప్రేమికుడు, అనిల్ బత్తుల గారితో హర్షణీయం
    పుస్తక ప్రేమికుడు, అనిల్ బత్తుల గారితో హర్షణీయం

    అనిల్ బత్తుల ఒక పుస్తక ప్రేమికుడు. ప్రేమ అంటే పుస్తకాలు కొనడం, చదవడం తో ఆగిపోకుండా, లభ్యం కాని అరుదైన తెలుగు పుస్తకాలను వెతికి వెంటాడి వాటిని వెలుగులోకి తీసుకొచ్చేంత. ఇదికాకుండా, సోవియెట్ పిల్లల జానపద కథలను ప్రచురించారు. వేల పుస్తకాలను తన ఖర్చుతో సేకరించి, లైబ్రరీలకు అందచేశారు. పదేళ్లు ఐటీ రంగంలో పని చేసి, రిసైన్ చేసి , ఇప్పుడు నిజామాబాద్ పక్కనుండే ఒక పల్లెకు షిఫ్ట్ అయ్యి, వరల్డ్ సినెమా లో పిల్లల గురించి…

  • కథానవీన్ గారితో హర్షణీయం
    కథానవీన్ గారితో హర్షణీయం

    కథా నవీన్’ గా సుప్రసిద్ధులైన శ్రీ వాసిరెడ్డి నవీన్ గారు , తెలుగు కథా సాహిత్య రంగంలో గత నలభై ఏళ్ళు గా పరిశ్రమ చేస్తున్నారు. విస్తృతంగా తెలుగు కథ గురించి వ్యాసాలు రాసారు. ‘ ప్రజాసాహితి’ పత్రిక సంపాదకునిగా పని చేశారు.. అనేక దేశాల్లో , తెలుగు కథ గురించి విశ్లేషణాత్మక ఉపన్యాసాలు చేసారు.1990 లో ‘తెలుగు కథా సాహితి’ అనే సంస్థ ను ఏర్పాటు చేసి, ప్రతి సంవత్సరంలో ప్రచురితమైన కథల్లో కొన్ని ఉత్తమమైన…

  • రచయిత దేవులపల్లి క్రిష్ణమూర్తి గారితో ఇంటర్వ్యూ! ‘నల్లగొండ మల్లి’ గారితో కల్సి
    రచయిత దేవులపల్లి క్రిష్ణమూర్తి గారితో ఇంటర్వ్యూ! ‘నల్లగొండ మల్లి’ గారితో కల్సి

  • మనసు ఫౌండేషన్ ఎం.వి.రాయుడు గారితో  ఇంటర్వ్యూ !
    మనసు ఫౌండేషన్ ఎం.వి.రాయుడు గారితో ఇంటర్వ్యూ !

    ఇంజనీరింగ్ డిగ్రీ , M.Sc through research , ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ సైన్స్ లో పూర్తి చేసిన ఎం. వి రాయుడు గారు, పవర్ ఎలక్ట్రానిక్స్ లో డాక్టరేట్ తీసుకున్నారు . మనసు ఫౌండేషన్ ని 2006 వ సంవత్సరం లో తన సోదరులైన డాక్టర్ గోపీచంద్ , డాక్టర్ చంద్ర మౌళి గార్లతో కలిసి స్థాపించారు. తెలుగులో ఇప్పటిదాకా ప్రచురితమైన అన్ని పుస్తకాలను డిజిటల్ ఆర్కైవింగ్ చేసి భద్రపరచాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న మనసు…

  • ‘ఎదారి బతుకులు’ రచయిత్రి భారతి గారితో ఇంటర్వ్యూ !
    ‘ఎదారి బతుకులు’ రచయిత్రి భారతి గారితో ఇంటర్వ్యూ !

    ‘ఎదారి బతుకులు’ రాసిన ఎండపల్లి భారతి గారు, చిత్తూరు జిల్లా, దిగువ బురుజు గ్రామానికి చెందిన వారు. ప్రాధమిక విద్యను అభ్యసించిన భారతి గారు, గ్రామీణ జీవిత సమస్యలను, వస్తున్న మార్పులను, దగ్గరగా గమనిస్తూ వచ్చారు. గత ఇరవై సంవత్సరాలుగా చిత్తూరుజిల్లా ‘వెలుగు’ మహిళా సంఘాల (SERP – సెల్ఫ్ హెల్ప్ గ్రూప్) పత్రిక ‘నవోదయం’లో విలేఖరి గా పనిచేస్తున్నారు. ప్రముఖ స్టిల్ లైఫ్ ఆర్టిస్ట్, సామాజిక కార్యకర్త , కిరణ్ కుమారి గారి ప్రోత్సాహంతో, కథలు…

  • సింగమనేని నారాయణ గారి రచనా జీవితం  పై ఓల్గా గారు!
    సింగమనేని నారాయణ గారి రచనా జీవితం పై ఓల్గా గారు!

    2021 ఫిబ్రవరి 25 వ తేదీన , సింగమనేని నారాయణ గారి మరణం, తెలుగు సాహితీ ప్రేమికులకు తీవ్రమైన విషాదాన్ని మిగిల్చింది. సుప్రసిద్ధ కథా రచయిత , విమర్శకులు నారాయణ గారు, తెలుగు కథ కు చేసిన సేవ అనన్య సామాన్యం. ఆయన కథారచన పై ప్రసంగించాలని , హర్షణీయం ప్రముఖ రచయిత్రి ఓల్గా గారిని కోరడం జరిగింది. వారు వెంటనే సమ్మతించి, చాల చక్కనైన వివరణాత్మకమైన సమీక్షను మనకందించారు. ఓల్గా గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ‘సింగమనేని…

  • పాఠశాల విద్యార్థులకు , తెలుగు సాహితీవేత్తలను పరిచయం చెయ్యడం ఎలా ?
    పాఠశాల విద్యార్థులకు , తెలుగు సాహితీవేత్తలను పరిచయం చెయ్యడం ఎలా ?

    ఎనిమిదేళ్ల కిందట , , అనంతపూర్ జిల్లాకి చెందిన తెలుగు అధ్యాపక దంపతులు, శ్రీ శ్రీనివాసులు గారు , శ్రీమతి యశోద గారు, అందరం మరిచి పోతున్న ప్రసిద్ధ తెలుగు కవులనీ , రచయితలనీ,ముఖ చిత్రాలతో , వివరాలతో పాఠశాలలో చదివే విద్యార్థులకు, పరిచయం చెయ్యాలని పూనుకున్నారు. దానికి ఒక మార్గం ఆలోచించారు. కొన్ని రోజుల తర్వాత వారి అబ్బాయి షణ్ముఖ కూడా, ఆ ప్రయత్నానికి చేయూతనిస్తూ , హర్షిత పబ్లికేషన్స్ ని ప్రారంభించాడు. వాళ్ళ జర్నీ…

  • ‘వేలుపిళ్లై రామచంద్ర రావు గారు’ హర్షణీయం తో !
    ‘వేలుపిళ్లై రామచంద్ర రావు గారు’ హర్షణీయం తో !

    ఈ ఎపిసోడ్ లో సుప్రసిద్ధ కథకులు , ‘వేలుపిళ్లై’ రామచంద్ర రావు గారితో హర్షణీయం ఇంటర్వ్యూ వినండి. అరవై ఏళ్ల రచనా జీవితంలో , పదంటే, పదే కథలు రాసారు రావు గారు. అన్నీ కథలు తెలుగు పాఠకులకు అత్యంత సుపరిచితాలు. ఎక్కువ కథలు , నీలగిరి టీ ఎస్టేట్స్, నేపధ్యంగా రాసినవి. అక్కడ అసిస్టెంట్ మేనేజర్ గారి చేరి, చైర్మన్ గా రిటైర్ అయ్యిన రామచంద్ర రావు గారు, ఆంధ్రా, మైసూరు స్టేట్ టెన్నిస్ ఛాంపియన్…

  • సుప్రసిద్ధ కథకులు , దర్శకులు, వంశీ గారి తో హర్షణీయం!
    సుప్రసిద్ధ కథకులు , దర్శకులు, వంశీ గారి తో హర్షణీయం!

    సుప్రసిద్ధ కథకులు , దర్శకులు వంశీ గారి రచనా జీవితం గురించి తెలుసుకోడానికి, హర్షణీయం టీం ఆయనను కలవడం జరిగింది. ఇంటర్వ్యూలో పాల్గొని తమ రచనా అనుభవాలను , అభిప్రాయాలను పంచుకున్నందుకు వంశీ గారికి హృదయ పూర్వక కృతజ్ఞతలు. ఇంటర్వ్యూ కి తమ తోడ్పాటు నందించిన శ్రీ వాసిరెడ్డి నవీన్ గారికి ధన్యవాదాలు. వంశీ గారు రాసిన ‘ఆకు పచ్చని జ్ఞాపకం ‘ కొనడానికిhttps://www.telugubooks.in/products/aakupachani-gnaapakam?_pos=15&_sid=2844ef7ef&_ss=r ‘వంశీ కి నచ్చిన కథలు’ కొనడానికి – https://www.telugubooks.in/products/vamsee-ki-natchina-kathalu?_pos=13&_sid=2844ef7ef&_ss=r హర్షణీయం కు…

  • ‘నల్లగొండ కథలు’ రచయిత వి.మల్లికార్జున్ గారితో హర్షణీయం!
    ‘నల్లగొండ కథలు’ రచయిత వి.మల్లికార్జున్ గారితో హర్షణీయం!

    నల్లగొండకు చెందిన వి.మల్లికార్జున్ గారు పత్రికా రంగంలో పనిచేసి, ఇప్పుడు సినీ పరిశ్రమ లో ప్రవేశిస్తున్నారు. ‘నల్లగొండ కథలు’ ఆయన రచించిన మూడో కథల సంపుటి. ఈ ఇంటర్వ్యూ లో తన రచనల గురించి, రచనా జీవితాన్ని గురించి మల్లికార్జున్ గారు అనేక విషయాలు మాట్లాడటం జరిగింది. మొదటి భాగం: రెండవ భాగం:

  • ‘ఆవు పులి మరి కొన్ని కథలు’  –  డాక్టర్ వి .చంద్రశేఖర్ రావు :    కథాపరిచయం
    ‘ఆవు పులి మరి కొన్ని కథలు’ – డాక్టర్ వి .చంద్రశేఖర్ రావు : కథాపరిచయం

    “The dream reveals the reality which conception lags behind, that is the horror of life and the terror of art” – Franz Kafka (1883-1924) కథ స్థూలంగా: కథలో పాత్రధారులు, భార్య , భర్త , ఓ ఐదేళ్ల కూతురు. కథంతా ఫస్ట్ పెర్సన్ నేరేషన్ లో ఉంటుంది. భార్య ఒక పెయింటర్. ప్రతివిషయాన్నీ వ్యాపార దృక్పధం తో చూసే భర్తా, అతనితో ఆమె గడిపే అసంతృప్తికర జీవితం,…

  • ‘మునికాంతపల్లి  కతలు ‘ – సోలోమోన్ విజయ కుమార్ గారితో హర్షణీయం.
    ‘మునికాంతపల్లి కతలు ‘ – సోలోమోన్ విజయ కుమార్ గారితో హర్షణీయం.

    మునికాంతపల్లి కథలు ‘ – సోలోమోన్ విజయ కుమార్ గారితో హర్షణీయం. ఒకే కథాసంకలనం లో 23 చిట్టి పొట్టి కతలు – విఫలమైన ప్రేమసఫలమైన ప్రేమచిన్న చిన్న ఆనందాలూచిన్నతనాన్ని గుర్తు చేసే అందమైన స్నేహాలూ , అనుబంధాలూషాక్ ఇచ్చే ట్విస్టెడ్ ముగింపులు కొన్నీ, ఓపెన్ ఎండెడ్ బుర్ర తొలిచేసే ముగింపులు,కొన్ని వ్యర్థాభరిత జీవితాలు , కొన్ని ఉత్సాహాన్నిచ్చే ముగింపులూఒక్కోసారి నడిపిస్తూ , ఒక్కోసారి అడ్డుతగిలే మతమూఅర్ధమయ్యే గొప్ప తాత్వికతఇవన్నీ –ఇంతకు ముందెన్నడూ మనం చవిచూడని ఒక…

  • సుప్రసిద్ధ కథకులు పతంజలి శాస్త్రి గారితో ఓ సాయంకాలం!
    సుప్రసిద్ధ కథకులు పతంజలి శాస్త్రి గారితో ఓ సాయంకాలం!

    హర్షణీయానికి స్వాగతం. డాక్టర్ పతంజలి శాస్త్రి గారి రచనా జీవితం, రచనలను ప్రభావితం చేసిన అంశాల గురించి, గత వారం , హర్షణీయం ఆయనతో సంభాషించడం జరిగింది. హర్షణీయం టీం తో బాటూ, ఛాయా మోహన్ బాబు గారు, బొలిమేరు ప్రసాద్ గారు కూడా ఈ చర్చలో పాల్గొన్నారు. శాస్త్రి గారికి , మోహన్ గారికి , ప్రసాద్ గారికి మా కృతజ్ఞతలు. ఆర్కియాలజీ లో డాక్టరేట్ తీసుకున్న తల్లావజ్ఝల పతంజలి శాస్త్రి గారు అరవైకి పైగా…

  • ఆచార్య కొలకలూరి ఇనాక్ గారితో ‘హర్షణీయం’ ఇంటర్వ్యూ !
    ఆచార్య కొలకలూరి ఇనాక్ గారితో ‘హర్షణీయం’ ఇంటర్వ్యూ !

    తెలుగు సాహిత్యంలో వున్న అన్ని సాహితీ ప్రక్రియలలో విశేష కృషి సలిపిన ఆచార్య కొలకలూరి ఇనాక్, గత ఆరు దశాబ్దాలు గా తెలుగు భాషని తన రచనలతో సుసంపన్నం చేస్తున్నారు.  ఆయన సాహితీసేవకు గుర్తింపునిస్తూ, జ్ఞానపీఠ్ సంస్థ, ప్రతిష్టాత్మకమైన ‘మూర్తిదేవి’ అవార్డుతో, కేంద్రప్రభుత్వం వారు ‘పద్మశ్రీ’ పురస్కారం తో ఆయనను సత్కరించడం జరిగింది.  రెండు వారాల క్రితం ‘హర్షణీయం’ ఇనాక్ గారితో ఆయన రచనలు, జీవితాన్ని గురించి సంభాషించే అవకాశం కలిగింది. ఈ ఎపిసోడ్ లో ఆ ఇంటర్వ్యూ…

  • శ్రీరమణీయం
    శ్రీరమణీయం

    హర్షణీయం పాఠకులకి, శ్రోతలకు దీపావళి శుభాకాంక్షలు . సుప్రసిద్ధ కథకులు , పత్రికా సంపాదకులు శ్రీ శ్రీరమణ గారు, హర్షణీయం కోసం తమ కాలాన్ని వెచ్చించి, తన రచనా జీవితం గురించి వివరించడం జరిగింది. ఈ ఇంటర్వూ నాలుగు భాగాలుగా ప్రసారం చేయబడుతోంది. శ్రీరమణ గారు గత ఐదు దశాబ్దాలుగా రచనా జీవితం గడుపుతున్నారు. తెలుగు వచనా రచనలో పేరడీ ప్రక్రియను ప్రారంభించి, పారడీకి తెలుగు సాహిత్యంలో సమున్నత స్థానాన్ని కల్పించిన వారు శ్రీరమణ గారు. ఆంధ్రజ్యోతి…

  • హర్షణీయం లో  శిద్ధారెడ్డి గారి ఇంటర్వ్యూ
    హర్షణీయం లో శిద్ధారెడ్డి గారి ఇంటర్వ్యూ

    హర్షణీయానికి స్వాగతం. ఇప్పుడు ఆడియోలో మీరు, హర్షణీయం, వర్ధమాన కథ రచయిత శ్రీ వెంకట శిద్ధారెడ్డి గారితో చేసిన ఇంటర్వ్యూ మొదటి భాగం వింటారు. ఇంటర్వ్యూలో ఆయన తన రచనాశైలి గురించి, తన కథా సంకలనం ‘సోల్ సర్కస్’ లోని కథల గురించి, తన సినీ జీవితం గురించి మాట్లాడ్డం జరిగింది. తన అమూల్యమైన సమయాన్ని హర్షణీయంకు అందించిన శ్రీ వెంకట్ శిద్ధారెడ్డి గారికి మా సభ్యులందరి తరఫున , ధన్యవాదాలు , శుభాభినందనలు. వెంకట్ శిద్ధారెడ్డి…

  • హర్షణీయంలో డాక్టర్ మధురాంతకం నరేంద్ర గారు
    హర్షణీయంలో డాక్టర్ మధురాంతకం నరేంద్ర గారు

    హర్షణీయానికి మరో మారు మీకందరికీ స్వాగతం. గత ఐదు నెలలుగా, హర్షణీయానికి మీరందరూ ఇస్తున్న ప్రోత్సాహానికి మా హృదయ పూర్వక కృతజ్ఞతలు. హర్షణీయం ద్వారా మా పాఠకుల్ని, శ్రోతల్ని , తెలుగు కథా సాహిత్యానికి కొంత దగ్గరగా తీసుకువెళ్లాలని మొదట్నుంచీ మా ప్రయత్నం గా వుండింది. దానికి కొనసాగింపుగానే కొన్ని రోజులక్రితం , తెలుగు కథా సాహిత్యంలో వున్న గొప్ప రచనలని ఒకటొకటిగా మీకందరికీ పరిచయం చెయ్యాలని, మేము అనుకున్నాము. ఆ ఆలోచన ఫలితమే ఇప్పుడు మీకందించబోతున్న…