ఆశ – ఆశంక :
వడి వడిగా నడుస్తోంది సుభాషిణి. ఆ మట్టి రోడ్డు మీద నడుస్తున్న వాళ్లందరినీ గబా గబా దాటుకొని వెళ్తోంది. సాయంకాలం నీరెండలో ధూళి ఆమె పాదాల నుంచి ఓ చిన్న తెరలా పైకి లేవటం కనపడుతోంది. మొహంలోకి పరికించి చూస్తే తన పెదాలు బిగబట్టి మనసులోని అల్లకల్లోల్లాన్ని తొక్కిపెడుతోందా అనిపిస్తోంది. ‘ఛకూలియా’ శనివారం సంత రద్దీ నించీ ఎలాగోలా తప్పించుకుని బయటపడింది తాను. ఇంకా ఐదు కిలోమీటర్ల పైన నడవాలి ఇంటికి చేరుకోడానికి. ‘రోషపల్’ లో ఉంటుంది సుభాషిణి.
మామూలు రోజుల్లో అయితే, సుభాషిణి ఛకూలియాలో ఆగి, కమరిగూడ తోటల్లో అపుడే కోసిన ఆలుగడ్డలు, ఎర్రటి టమాటోలతో పాటూ ఒక మంచి ఆకు కూర కొంటుంది. అక్కణ్ణించీ నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్లి బెస్త ముసిలిదాని గుడిసె ముందుకెళ్లి నిలబడి, ఖరీదైన ‘రూయి’ , ‘కాట్లా’ చేపలు తాజాగా లేవు అని నసుగుతూ, కోనేసేటట్టు బాగా బేరం చేసి చేసి , చవగ్గా దొరికే ‘బాష్ పాటాలు’ మాత్రం కొనుక్కుని వాటితో ఎండబెట్టి, కమ్మటి పులుసు చేసుకుందాం అని ఊహించుకుంటూ, చివరికి ‘మా మోనోసా’ స్వీట్ల షాపు దగ్గర ఆగి, తన పద్నాలుగేళ్ల పరూల్ కీ, పదకొండేళ్ల నిలుమోనీకీ , ఏడేళ్ల చంటోడు కూనా రామ్ కీ, ఓ అర డజను జోబె లడ్డూలు, సమోసాలు కొనుక్కుని, అపుడు కానీ ఇంటివైపు నడక మొదలు పెట్టదు.
నాలుగు జిలేబీలు మాత్రం, కాయితపు పొట్లంలో దాచుకుని, ఆ పొట్లాన్ని గుండెలకదుముకొని నడుస్తోంది సుభాషిణి. ఒళ్ళు, కళ్ళు రోడ్డు మీదున్నట్టున్నా, తన ఆలోచనలు ఇంకెక్కడో తిరుగుతున్నాయి. తొందరగా పని ముగించుకు బయటపడదాం! అనుకున్నా కుదరలేదీరోజు.
అందరినీ పలకరిస్తూ నిదానంగా నడిచే అలవాటున్న సుభాషిణి, పొద్దు పొడిచే ముందే ఇల్లు చేరడం అనేది చాలా అరుదు. మామూలు రోజుల్లో అయితే, సాయంకాలం పూట, సుభాషిణి తాను పనిచేసే రైస్ మిల్లు , ఇంకా అల్యూమినియం ఫ్యాక్టరీ , సోపు ఫ్యాక్టరీ , బద్రీనాథ్ సేటు తోట , దేవ్ బాబు కోళ్ల ఫారం, ఇంకా చుట్టుపక్కల కంస్ట్రక్షన్ సైట్లలో పని చేసే స్నేహితురాళ్ళ తో పాటూ కబుర్లు చెప్తూ ఊరి వైపు నడుస్తుంది. నేతచీరలు కట్టుకొని కొంతమంది, సిలుకు చీరలు కట్టుకొని ఇంకొంతమంది, పెద్దా చిన్నా ఆడవాళ్ళందరూ కలిసి, సీవెండి కారియర్లు మోసుకొని, తలగుడ్డలు నడుముకు చుట్టుకొనో, భుజానికి తగిలించుకునో, నవ్వుతూ, తుళ్ళుతూ, కేరింతలతో ఇంటికి నడిచే సమయం అది. ప్రైవేటు జీపుల, ఝార్ఖండ్ గవర్నమెంటు బస్సుల హారన్లతో, వాటిలో వుండే క్లీనర్లు తప్పుకోమంటూ పెట్టే కేకలతో మారుమోగుతూ ఉంటుంది ఆ రోడ్డు. అలిసిపోతేనో ఆలస్యమైపోతేనో తప్ప, వీటినిఆపి ఎక్కేవాళ్ళెవరూ ఉండరు, నడుచుకుంటూ వెళ్లే వాళ్ళల్లో. ఎక్కారంటే మటుకు, ఇవ్వాల్సిన డబ్బుల గురించి సగానికి సగం బేరాలు మొదలు. ప్రతి పైసా మీదా హోరా హోరీ పోరాటంతో పాటూ శాపనార్థాలూ తిట్లూ అదనం. వాటినన్నిటినీ విని ఆనందిస్తూ ఇంకా ఇంకా ఉసికొల్పుతూ వుంటారు డ్రైవర్లు క్లీనర్లూ. లోపలున్న, చిన్నా పెద్దా అందరికీ ఇదో మంచి కాలక్షేపం. తన బొడ్డుసంచీలో వుండే చిల్లరను సాధ్యమైనంతవరకు కాపాడుకుంటూ, బండెక్కి ప్రయాణించే సౌకర్యాన్ని కూడా వినియోగించుకుంటూ, ఇలాంటి ఎన్నో పోరాటాల్లో పాల్గొన్న సుభాషిణికి, నిజానికి నడకంటేనే ఇష్టం, నడుస్తూ అయితే డుమినీతో కాస్సేపు మాట్లాడుకోవచ్చు. డుమిని సుభాషిణికి మంచి స్నేహితురాలు. పక్కూరు బలిపూర్లోనే ఉంటుంది. ఒకే చోట పనిచేస్తున్నా, ఇంటికి నడిచేటప్పుడే వాళ్ళిద్దరికీ మాట్లాడానికి సమయం దొరికేది.
ముదురు ఎరుపులోకి మారుతున్న ఆకాశాన్ని ప్రతిఫలిస్తోందా అన్నట్టు మట్టి రోడ్డు లేత నారింజ రంగులో మెరుస్తోంది. పని ముగించుకుని ఇంటికి వెళ్లే ఆడవాళ్ల కబుర్లతో, గూళ్ళల్లో ఆశగా ఎదురుచూస్తున్న పిల్లల కోసం, ఆహారం నోట పెట్టుకుని వేగంగా ఎగురుతూ వెళ్లే పక్షుల శబ్దాలతో కోలాహలంగా వుంది వాతావరణం.
సుభాషిణి నడక లో వేగం బాగా హెచ్చింది. ఒంటరిగా నడుస్తోంది.
“ముందర నువ్వు బయలుదేరు” అని తొందర పెట్టారు తన తోటి వాళ్ళు.
డుమిని కూడా, “నడవకుండా , గమ్మున అద్దె జీపులో ఇంటికెళ్ల”మని చెప్పింది.
పక్కన ఆగున్న జీపులో ఎలాగోలా ఎక్కుదామని ప్రయత్నించింది సుభాషిణి. ఆ జీపు అంతా ఇంటికెళ్ళే జనాలతో నిండిపోయుంది. కాలు మోపడానికి కూడా స్థలం లేదు. పగటి వేషగాళ్ళ మాదిరి వింత వింత డ్రెస్సులేసుకుని, విచిత్రంగా జుట్టు కత్తిరించుకుని, మీద సామాన్లు కట్టేసే చోట కూర్చుని, ఇద్దరు కుర్రవాళ్ళు కిళ్ళీ నములుతూ, జీపులో స్థలం కోసం ఆదుర్దాగా తొంగి చూసే వాళ్ళ పైన వుమ్మేస్తున్నారు. బాధితులు ఎవరైనా పైకి కోపంగా చూస్తే, వెకిలిగా పళ్ళు చూపిస్తూ నవ్వుతున్నారు. ఒక చివరన డ్రైవరు సాహసోపేతంగా సగం శరీరం జీపులో కూర్చోబెట్టి, మిగతా సగం గాల్లో వేలాడేసుకునుంటే, అతడి తోటే ఇంకో ముగ్గురున్నారు ముందు సీట్లో. ఈ చివరన ఫుట్ బోర్డు మీద కాలు పెట్టి ఒకడు, ఇద్దరి మధ్య వున్న సందులో తన శరీరాన్ని ఎలాగోలా ఇరికించుకుని రెండోవాడు కనపడుతున్నారు. డ్రైవరు పక్కనుండే ఆఖరివాడి కాళ్ళ మధ్యలో గేర్ వుంది. డ్రైవరు గేర్ మార్చినప్పుడల్లా అతని పిడికిలి తనకు తగల రాని చోట తగిలే ప్రమాదం ఉందని వాడికి తెలీకుండా పొయ్యుండదు.
‘ఈ బండి ఎలా నడుస్తుందో ఆ భగవంతుడికే తెలియాలి. ఏ ప్రమాదం జరగకుండా ఆయనే కాపాడాలి వీళ్లందరినీ ఈ రోజు.’
ఆ జీపులో కూరుకు పొయ్యి దేవుణ్ణి తల్చుకునే కంటే , నడకే మేలనిపించింది సుభాషిణికి.
సుభాషిణితో అన్నాడు క్లీనర్ జీపు పైభాగాన్ని చూపిస్తూ, కన్ను గీటుతూ “ఉపోర్ చాప్ గో మాసి”.
సుభాషిణి ఒళ్ళు భగ్గున మండింది .
“తూయి చాప్ , అమీ నై చాపి” అని వాణ్ణి గట్టిగా కసురుకుని, తన టిఫిన్ కారియర్ చేతికున్న గుడ్డ సంచీలో పడేసి, , జిలేబీల పొట్లం, బంగారం దాచుకున్నట్టు, గుండెల కదుముకుని, తల ఎగరేసి తీక్షణంగా ముందున్న రోడ్డు వైపు చూస్తూ మళ్ళీ నడక మొదలు పెట్టింది. సుభాషిణి వాలకం చూస్తే ఏదో యుద్ధానికి సన్నద్ధమై పోతున్నట్లుంది.
భారంగా నడుస్తున్న ఎద్దు బండ్లను, రోడ్డుకు అడ్డదిడ్డంగా వచ్చే రిక్షా వాళ్ళను, సైకిల్ నడిపే వాళ్ళను తప్పించుకుంటూ అలానే చాలా దూరం నడిచింది.
ఇందాకటి జీపు హారన్ గట్టిగా మోగించుకుంటూ వెనకనించి వస్తోంది .
‘సోర్ గో మాసి’ అని విసురుగా అరిచాడు, పక్కకు జరగమన్నట్టు చేతులూపుతూ క్లీనర్ గాడు .
చీరకొంగును మొహంమీద వేస్కుని, ఒక్క ఉదుటున రోడ్డు పక్కనే వున్న గడ్డి పొదలోకి గెంతింది సుభాషిణి.
నల్లటి పొగతో కల్సిన ఎర్రటి దుమ్ములో ఆమెను ముంచేస్తూ ముందుకెళ్లింది జీపు.
“ కీ మాసీ, మోర్తే ఖుట్చూ” అని అరిచాడు వెడుతున్న జీపులోంచి క్లీనర్.
“మోర్బెక్ తేరే మా” అంటూ అరిచింది సుభాషిణి, “ గాడియే ఛాపి ఫూటానీ కోర్చూ, జొమీనే చాల్ దేఖీ”
సుభాషిణి కేకల్ని తన శబ్దంలో కలిపేసుకుని ముందుకెళ్ళిపోయింది, కిక్కిరిసున్న జీపు. మండుతున్న కళ్ళు నులుముకుంటూ, లోపల్నించీ పొంగి వస్తున్న దుఃఖాన్ని అణుచుకుంటూ, అలానే నిలబడిపోయింది ఓ రెండు క్షణాలు సుభాషిణి. దుమ్ములో స్నానం చేసినట్టుంది ఆమెకి. ఆమె మనసులో ఇంకో మూల ఓ చిన్న బాధ మొదలైంది. తనకు ఏ మాత్రం తెలీని ఓ ఆడమనిషిని తిట్టేసింది. కాదు కాదు . అంతా ఆ క్లీనర్ గాడి వల్లే, ఎందుకు కనిందో ఇలాంటి వాణ్ణి వాడి తల్లి. తన తల్లి వయసున్న ఆడవాళ్లను అనగూడని మాటలు అంటాడా? ఎందుకూ పనికి రాని అడ్డగాడిద! వాళ్ళమ్మ కొంచెం మర్యాద నేర్పించుంటే, బావుండేది ఎదవకి. నా చంటాడు కూనారామ్ చేస్తాడా ఇలాంటి పని? లేదు లేదు . ఎప్పటికీ చెయ్యడు. కొడుకును సరిగ్గా పెంచనందుకు , వాళ్ళమ్మను తిట్టడంలో తప్పే లేదు. అది సరే .. అయినా వాళ్ళ అమ్మ ఏమి చేసింది పాపం? . కేకలు పెడ్తూ తనని ఎగతాళి చేసింది ఆ క్లీనర్ గాడు కదా…
సుభాషిణి మనసు పరిపరి విధాల పోతోంది.
భగవంతుడా … నా చేత ఎలాంటి ఎలాంటి పనులు చేయిస్తున్నావు? వాడు ఆలా ఎందుకు మాట్లాడాలి, నేను నోరు పారేసుకునేట్టు ?అయినా ఇలాటివన్నీ ఈ రోజే ఎందుకు జరుగుతున్నాయి…. నాకు సీటు దొరక్కపోవడం , వాడి చేత మాటలు పడ్డం? నేను ఇంకో బండి చూసుకొని వుండొచ్చుగా? .. ఏం జరుగుతోంది నాకు?
అప్పటిదాకా అతికష్టం మీద ఆపుకున్న శోకం పైకి తన్నుకొస్తోంది సుభాషిణికి. కళ్ళు, నీళ్లతో మసకబారాయి. రెండుచుక్కలు మాత్రం ఎలాగోలా కళ్ళని దాటుకుని, ముదురు గోధుమ రంగు బుగ్గల మీదున్న ఆ నల్లటి మచ్చలమీద జారుతూ చారికల్లా మారాయి. నల్లటి మచ్చలు … క్షణ క్షణం ఒత్తిడితో అలుపెరగకుండా పని చేస్తూ, ఇంటి భారం ఒంటరిగా ఇన్నాళ్లు మోస్తూ వచ్చినందుకు, కాలం ఇచ్చిన బహుమతి.
నాకే ఎందుకు జరగాలిలా? నాకే ఎందుకు? ఇది కూడా ఓ పరీక్షా? ఎన్ని పరీక్షలు పెట్టావు? ఇంకా నా మీద దయ కలగలేదా నీకు? ఇంకెన్ని చూడాలి నేను? ఎంతమందిని నానుంచి తీసుకెళ్లి పోతావు?
—–
“మానాన్నపేరుపెడదాం వీడికి ‘కూనారామ్’ అని”, అన్నాడు భర్త సూనారామ్.
‘ఊ’ కొట్టింది ! వంచినతలకూడా పైకెత్తకుండా. వినపడిందోలేదోఅతనికి.
ముందుపుట్టినఇద్దరుఆడపిల్లల్నీనెత్తినపెట్టుకున్నాడు. మూడోసారికొడుకేకావాలంటాడు. తనకుకూడాకొడుకేకావాలిఅనిఅతనికిఎలాచెప్పాలి? నిండుగర్భంవైపుతదేకంగా అతనుచూస్తూంటే , అతన్నేచూస్తూవుండాలనిపించేది. ఒక్కమాటమాట్లాడకలిగేదికాదుతను.
“ఈసారిమటుకు కొడుకునేకంటున్నావు. కచ్చితంగా!” చీరసవరించుకుందిఅతనిచూపులతోదిష్టితగులుతుందేమోనని.
‘వాడిపేరుకూనారామ్. నాన్నపేరు. వింటున్నావా” రెట్టించాడు.
“అలానే . కూనారంఅనేపెడదాంవాడికి “ చెప్పాలనుకుందితను. కానీ, ఏమీచెప్పకుండా, ఆచూపులనుంచిఅతికష్టంమీదతప్పించుకుంటూఅక్కడనించీకదిలిపోయిందిసుభాషిణి.
సూనారాంఆనందానికిహద్దులేకుండావుంది. నాన్నవెనక్కువస్తున్నాడు, పసిబిడ్డగా. తనబిడ్డగా…
అతనిఅంతులేనిఆనందానికితనేకారణంఅవుతున్నాననిసుభాషిణికూడా చాలాసంతోషంగావుంది, “కొడుకునేఇవ్వుభగవంతుడా”
కొడుకేపుట్టాడు. అనుకున్నట్టుగాతాతపేరేపెట్టారు. అతనుకొడుకునెప్పుడూపేరుపెట్టిపిలవడు. ‘నాన్నా’ అనే.
సుభాషిణికూడా ‘నాన్నా’ అనేపిలుస్తుంది. భర్తని, మావగారిని, బావగారినిపేరుపెట్టిపిలిచేపాపంఏగౌరవప్రదమైనస్త్రీకూడాచెయ్యదు.
కొన్నిరోజులతరవాతసుభాషిణి వాడికిఓముద్దుపేరుపెట్టింది – ‘కూనూ‘. అవును ‘కూనూ’! ఇంట్లోఅందరికంటేచిన్నవాడుకాబట్టిసరైనపేరే.అంతాఆనందంగావున్నారు… సూనారామ్ , సుభాషిణి, పెద్దక్కపారుల్, బుడ్డిఅక్కనిలుమోని.
అందరూఒకేగూట్లో, కుటుంబంఅంతా. , ఆసంతోషంఎన్నోరోజులునిలవలేదు.
అదికూనారామ్దోగాడటంమొదలుపెట్టినరోజు. సాయంకాలంవర్షంమొదలైంది. పనిచేస్కునిఇంటికి వస్తున్న సూనారామ్మీద పిడుగుపడిచనిపోయాడు. కిందపడున్నసూనారామ్గుండెమీదఒకపెద్దనల్లటిరంధ్రం, దానిచుట్టూకాలిపోయిననల్లటివెంట్రుకలు. శరీరంఎడమవైపుఅంతావేడికినల్లగాకమిలిపోయుంది. నలుపు …ఆఆదివాసీశరీరపురంగునుమించిననలుపు. శవంరోషపాల్గ్రామంఅవతలఒకపెద్ద ‘మహువా’చెట్టుకిందవుంది. ఆచెట్టుకూడాపూర్తిగాకాలిపోయింది. ఒకప్పుడుపచ్చగాఆకులతోకొమ్మలతోనిండుగావున్నచెట్టు,నల్లటి కాండంతోమాత్రం మిగిలింది .
గ్రామస్తులు అనుకున్నారు –
“అంతతొందరదేనికి? మిగతావాళ్ళలాఆస్కూలులోకిపరిగెత్తివుండొచ్చుగా. పాపంఎంతమంచోడు?
అదిసరే, తనమీదపిడుగుపడదుఅనిఎలాఅనుకున్నాడు” ?
“చూడుతమ్ముడూ, చావువచ్చేటప్పుడుఈలలువేస్తూ, డప్పులుకొట్టుకుంటూరాదు. ఇంటికిపొయ్యికొడుకుతోఆడుకుందాంఅనితొందరపడుంటాడు. ఇప్పుడుఆకొడుకేకాదు , ఇద్దరుఆడపిల్లలుకూడా… వాళ్లంతాఏమవుతారు? “
ఏమవుతుంది? ఎన్నిరోజులనిఆలోచిస్తూకూర్చుంటారు? సుభాషిణి, పారుల్, నిలుమోనిబాధ్యతలుతలకెత్తుకున్నారు. సుభాషిణిపనికికుదిరింది. పారుల్నిలుమోని , ఆపసివాడికిచిట్టితల్లులుగామారారు. కూనారామ్తండ్రిచనిపోయినప్పుడుమరీచిన్నవాడుకాబట్టి, తండ్రిలోటుతెలియలేదు . కానీతండ్రిగురించిఅమ్మనుఅడిగేవాడు, నాన్నఎలాఉంటాడనీ? ఎలామాట్లాడేవాడనీ? ఎలాఆ వర్షంకురిసిన రోజుతప్పిపోయాడని?
వాడికినాలుగేళ్లప్పుడుఓసారిఅడిగాడు –
“అసలేంజరిగిందమ్మానాన్నకిఆరోజు”?
“ఓహ్అదా, కనపడకుండాపోయాడునాన్న”
“ఎలా” ?
“ఆ… విపరీతంగావాన….. నీళ్లు…నీళ్లుతీసుకెళ్లాయినాన్నని”.
“నీళ్ళా “?
“అవునునీళ్లు… నీళ్ళే” !
ఇదిజరిగినప్పటినించీ, నీళ్లుఅనేపదంవింటేనేభయపడిపోయేవాడుకూనారామ్. వాడికిస్నానంచేయించడంఅసాధ్యంఅయిపొయింది. రోజులురోజులుస్నానంమానేసినందువల్లకాళ్ళు,పిక్కలుమట్టిగొట్టుకునిఉండేవి. ఇంకాఇలాకుదరదనిచెప్పి , ఒకరోజు , సుభాషిణిపారుల్కలిసి, కూనారామ్నిబావిదగ్గరకెత్తుకెళ్ళి, బట్టలిప్పి, స్నానంచేయించడంమొదలుపెట్టారు. వాడుగిలగిలకొట్టుకున్నాబకెట్లుబకెట్లుచల్లటినీళ్లుఆపకుండామీదపోశారు. సుభాషిణికదలకుండాగట్టిగాపట్టుకుంటే, పారుల్ముందు ఒకఎర్రలైఫ్బాయ్ముక్కతోఒళ్ళంతారుద్దితర్వాతపీచుపెట్టి తోమేసింది. “వొద్దువొద్దు” అంటూవాడుపెట్టేకేకల్నిపట్టించుకునేనాధుడేలేకేపోయాడు.
అప్పట్నుంచీకూనరామ్కినీళ్లంటేభయంపోయి, ఊరిచెరువులోకూడా ఈతకొట్టడంమొదలుపెట్టాడు. చెట్లకొమ్మలమీదినుంచిదూకడం, ఈతతోపాటూనీళ్ళల్లో రకరకాలైనవిన్యాసాలుచేయడం.. ఇదేపనిరోజూ.
———-
నీళ్ళు .. నీళ్ళతోనే చల్లబరిచింది, నిన్న సాయంకాలం జ్వరంతో కాలిపోతున్న వాడి వొంటిని. భరించరాని నొప్పి, మంటతో బాధ పడ్తున్నాడు కూనారామ్. చూడనలివి కాలేదు సుభాషిణికి.
సుభాషిణి నిన్న ఇంటికొచ్చేటప్పటికే,పారుల్ కాలిపోతున్న వాడి ఒంటినీ, నుదిటినీ, తడి గుడ్డ పెట్టి తుడుస్తోంది. రాత్రంతా నిద్ర పోలేదు వాడు. వాడు జ్వరంతో పెడ్తున్న మూలుగులకి, సుభాషిణి, పారుల్ , నిలుమోని ఎవరికీ కంటి మీద కునుకు లేదు.
ఈరోజు పొద్దున్నే, పక్కింటి ‘పాటా’ కొడుకు “పుచ్చు’ ని, డాక్టర్ని తీసుకురావడానికి పంపితే డాక్టర్ మొలిక్ వచ్చాడు. ఆయన రోజూ జాగారామ్అనే ఊరునించి, రైల్లో పొద్దున్నే ఛుకులియా వచ్చి, ఒక మందుల దుకాణంలో కూర్చుని రోగులని చూస్తాడు. కూనరామ్ కోసం, ఎవరిదో మోటార్ సైకిల్ తీస్కొని రోషపల్ కి వచ్చాడు. డాక్టర్ మొలిక్కి చాలా మంచి పేరుంది. పల్లె జనాలకు మందులు ఉచితంగా ఇస్తాడు. తన బాగ్లో ఉన్న సాంపిల్స్ లో నుంచి కొన్ని మందులు తీసి సుభాషిణికిచ్చాడు. వచ్చి చూసినందుకు మాత్రమే డబ్బులు తీసుకున్నాడు డాక్టర్ మొలిక్….ఒక ముప్ఫయి రూపాయలు. తన చేతి సంచీ లోంచి తీసి నలిగిపోయిన మూడు పది రూపాయ నోట్లు ఇచ్చింది సుభాషిణి.
పనికి పోయే ముందర కొంతసేపు కూనరామ్ పక్కన కూర్చుంది సుభాషిణి.
జ్వరం కళ్ళేసుకుని వాళ్ళ అమ్మ వైపు చూస్తూ అడిగాడు వాడు.
“అమ్మ ఈరోజు శనివారం కదా. సంత నించి నాకు జిలెబీలు తెచ్చిపెడతావా”?
మాటల్తో బాటూ వేడి గాలి వాడి నోట్లో నించి వచ్చి సుభాషిణి వేళ్లను తాకింది..
“తెస్తాను రా. సాయంత్రం వచ్చేటప్పుడు కొనుక్కొస్తాగా”.
“అమ్మా! ఏదైనా తియ్యగా తినాలనుందే. మర్చిపోకుండా జిలెబీలు తీసుకురావే”.
“మర్చిపోను లేరా. ఇప్పుడేమీ మాట్లాడకుండా పడుకో. తప్పకుండా తెస్తాలే”.
————–
మిల్లు చుట్టూ వుండే ప్రహరీ గోడ మీద పెంకుల ముక్కలు పైకి పొడుచుకుని వచ్చినట్టుగా అమర్చి వున్నాయి. పొద్దున పనికొచ్చినప్పట్నుంచీ, ఆ ప్రహరీ గోడ దాటుకొని, ఎపుడెపుడు బయట పడదామా అని చూస్తూనే వుంది సుభాషిణి.
“జిలెబీలు, జిలెబీలు” …. వల్లె వేస్తోంది సుభాషిణి, కూనారామ్ మాటలు మంత్రం లా.
ఊరికూరికే చోటాబాబు గదిలోకి వెళ్లి చెమ్మపట్టిన ఆ నీలం రంగు గోడ మీదున్న గడియారంలో పెద్ద చిన్న ముళ్ళు ఎలా ఉన్నాయో గుర్తు పెట్టుకుని, కలూ రానా దగ్గరకు పరిగెడుతోంది.
రోషపల్ , కమ్మరి బజార్ నించి వచ్చే కలూరానా అదే రైస్మిల్లు లో పనిచేస్తాడు. డిగ్రీ చదూకోలేదు కానీ, నిశానీ అయితే మాత్రం కాదు. చేతిలో వున్న నోటు.. రంగు, సైజు చూడకుండా, దాని విలువ చెప్పగలడు. సంతకం చేయడం గూడా వచ్చు అతనికి. ఇదిగాక చిన్న చిన్న కూడికలు , తీసివేతలు, భాగహారాలు తెలుసు. ఇంట్లో కమ్మరి పని చేసుకోడం పాటు , అవీ ఇవీ చిన్న చిన్న పనులు చేసుకు బతుకుతాడు.
ఈరోజే పదే పదే సుభాషిణి అతనిదగ్గరకెళ్ళి టైం ఎంత అయిందో వాకబు చేస్తోంది.
“ చిన్న ముల్లు ఇలా ఉందా” బియ్యం రాశి మీద వెదురు బద్దతో గీసి చూపిస్తూ అడిగాడు సాలోచనగా.
తల పైకీ కిందికీ ఊపింది సుభాషిణి.
“టైము పదకొండయిందక్కా!”
“ఇంకా పదకొండేనా?” అనుకుంది సుభాషిణి.
“అక్కా , వింటున్నావా” ? అడిగాడు కలూరాం ఎక్కడో ఆలోచిస్తూన్న సుభాషిణి ముంజేతిని తడుతూ.
“ఆ .. ఆ.. వింటున్నా! ఏమన్నావ్” ?
“ఈ రోజు పన్లోకి ఎందుకు వచ్చావు? ఆ విషయం ముందు చెప్పు!”
“ఏందీ? పనికా” ?
“వూ దాని గురించే..వాడికి అంత జ్వరం ఉంటే పనికి పరిగెత్తుకొచ్చావు , నీకేమన్నా బుర్రుందా” ?
“ జ్వరమేగా!.. చూద్దాం”
“ఏవిటి చూసేది? ఇందాకణ్ణించీ నేచూస్తున్నా, ఇంటికెళ్లడానికి నువ్వు పడే తపన… విషయం చోటా బాబు కు చెప్పి ఇంటికెళ్లొచ్చుగా” ?
“మంచి సలహానే”. అనుకుంది సుభాషిణి . కానీ అక్కణ్ణుంచీ కదల్లేదు.
“ జీతం ఏమీ కోసెయ్యడులే. అయినా కొస్తే ఏమవుతుంది? అక్కడ కునూ నీ గురించి ఎంత కలవరిస్తున్నాడో” ?
సుభాషిణి సాయంత్రం నాలుగుగంటల దాకా పనిచేసి, ఒక్క ఉదుటున మిల్లు నుంచి బయటపడి, విల్లు నించి విడివడిన బాణంలా ఇంటివైపు నడవడం మొదలుపెట్టింది.
“దీని బుర్ర సంత కెళ్ళింది.” అంది డుమిని. “ పొద్దున్న నడుచుకుంటూ వచ్చింది. కూనారామ్ కి బాలేదు అని ఒక మాట చెప్పుండొచ్చుగా. చూడు మొహం ఎలా ఉందొ”
“ఇంటికి నడిచెళ్ళొద్దు. బస్సులోనో జీపులోనో పో.వింటున్నావా”
——————-
“అమ్మా ! “
ఇంటికి చేరుకునే తొందర్లో వున్న సుభాషిణి , ఒక్కసారి వెనుదిరిగి చూసింది. అచ్చం కూనారామ్ పిలుపులానే వుంది.
‘ఊహూ! వాడు కాదు’.
మాసిపోయిన బట్టలేసుకుని శుష్కించిన శరీరంతో, ఆమె మొహంలోకే చూస్తున్నాడు వాడు. కూనరామ్ వయసే ఉండొచ్చు ఆ పిల్లవాడికి. వాడి చూపులో ఆకలి… ఏదో బాధ.
‘ఎవరి పిల్లవాడు? ఈ నిర్జన ప్రదేశంలో ఒంటరిగా ఎందుకున్నాడు? దగ్గర్లో ఊళ్ళు కూడా ఏవీ లేవే?’
దూరాన మాత్రం కొన్ని వెదురు పొదలు, బూరుగు మారేడు చెట్ల మధ్యలో కొన్ని ఇళ్ళు కనపడుతున్నాయి. అది బాలిపూర్ కదూ, డుమిని వాళ్ళ వూరు.సాయంత్రం పశువుల మందలను ఇళ్లకు తోలుకెళ్తూ గొల్లవాళ్ళు…. సంజె వెలుగు పరుచుకున్న చిన్న గుట్ట, నలుపు తెలుపు చుక్కల్లా కనపడ్తున్న ఆవులు, కొంతమంది పిల్లలు ….
‘ఈ పిల్లవాడు అక్కణ్ణుంచే వచ్చి ఉంటాడా … ఇంత దూరం. జరిగే పని కాదు. వొంట్లో కూడా బాగాలేనట్టుంది వాడికి. భగవంతుడా ! ఎవరీ పిల్లవాడు?’
“అమ్మా! చాలా ఆకలిగా వుంది. తినడానికి ఏవన్నా ఉంటే పెట్టవూ?”వాడు ఇంకొంచెం దగ్గరగా వచ్చి అడిగాడు.
వాడి గొంతు వింటూంటే సుభాషిణికి పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్లి కూనారంను చుట్టేసుకోవాలనిపిస్తోంది.
ఉద్విగ్నతతో చేష్టలుడిగి రెండు క్షణాలు అలా ఉండిపోయింది. ఓ నీటిపొర కళ్ళను కమ్మేసి, ఎదురుగా వున్నది తన కొడుకేనేమో అనిపించింది సుభాషిణి చెవులకి.
‘ఎవరీ పిల్లవాడు? నా దగ్గరికే ఎందుకు వచ్చి చెయ్యి చాచాడు?’
చుట్టూ నిశ్శబ్దం అలముకుంది. తేమభారం ఎక్కువై, ఎక్కడ గాలి అక్కడే ఆగిపోయింది. రోడ్డు అంతా నిర్మానుష్యం . మనుషులు బళ్ళు, పశువులు అన్నీ ఒక్కసారిగా అదృశ్యం అయినట్టుగా వుంది. వందల సార్లు డుమినితో కలిసి తిరిగిన ఆ ప్రదేశం, ఎందుకో పరిచయం లేనట్టుగా అనిపిస్తోంది సుభాషిణికి.
“లేదు నా దగ్గర నీకివ్వడానికి ఏమీ లేదు …వెళ్ళిపో” ఆ పిల్లవాణ్ణి కసిరింది. తన గొంతులో తనకే తెలీని కరుకుదనం .
ఉన్నట్టుండి ఏవో ఆలోచనలు కమ్మేసి, కన్నీళ్లు ఇంకిపోయి గుండె వేగంగా కొట్టుకోడం మొదలైంది. దురదృష్ట దేవత మనిషిరూపంలో వచ్చి తిండి బట్టల కోసం అడుక్కుంటుందట. అవి ఇచ్చిన వాళ్ళని ఆవహించి జీవితాంతం ఏడిపించేస్తుందట. సుఖశాంతులు లేకుండా చేసి, మనిషి మనసు, బతుకు రెండూ అస్తవ్యస్తం చేస్తుందిట. దెయ్యాలను పూజించే దాహినీల గురించి కూడా వినింది తాను. దాహిని చనిపోతే, ఆ ఆత్మ వేరే మనిషినో జంతువునో ఆవహించి, కేకలు పెడ్తూ , మనుషుల్ని తరుముతాయి. లేదంటే మనిషిలా వచ్చి అన్నం పెట్టమని, కాసింత నీడనిమ్మని ప్రాధేయపడతాయి. సహాయపడినవాళ్ల మీదకి తోడేళ్ళు, త్రాచు పాములు వస్తాయి.
‘ కాదు, కాదు, ఇవేమీ కాదు ఎదురుగా వుంది ఆకలేస్తున్న పసివాడు.’
“అమ్మా చాలా ఆకలేస్తూంది. ఒంట్లో అస్సలు బాలేదు. అన్నం తిని ఎన్నో రోజులైంది. దయ చేసి ఏదైనా పెట్టమ్మా ..”
“చెప్పాకదా, నా దగ్గర ఏమీ లేదని” సుభాషిణిలో అసహనం మొదలైంది. జిలేబీ పొట్లం ఇంకొంచెం గట్టిగా పట్టుకుంది.
“ మీ అమ్మెక్కడ? మీ అమ్మ దగ్గరకెళ్ళి అడుగు. అయినా నిన్నిలా బిచ్చమెత్తుకోమని ఎలా వదిలేసింది?”
మళ్ళీ నడవడానికి ఉపక్రమించింది. వాడు వదిలేటట్టు లేడు. “మా అమ్మ పట్నం లో పనిచేస్తుంది. నాకు జిలెబీలు తెస్తానని చెప్పింది. ఇప్పటి దాకా రాలేదు. అమ్మా మీరైనా ఎదో ఒకటి పెట్టండి.”
“జిలేబీలా? వూ.. వాటి సంగతి నీకెట్లా తెల్సు. నా వెనకాలే వస్తున్నావా ఏవిటి? తిరస్కారంగా వాణ్ణి చూసి నడవడం మొదలు పెట్టింది. వాడు వదిలేటట్టు లేడు. నడకలో వేగం పెంచింది.
——————
ఏదో పెద్ద బండి వస్తున్న శబ్దం వినపడి, సుభాషిణి ఒకసారి వెనక్కి తిరిగి చూసింది.
పూర్తిగా నిండిపోయున్న ఝార్ఖండ్ గవర్నమెంటు బస్సు. బస్సు క్లీనర్, ఆ జీపు వెనకాల వేలాడే పిల్ల వెధవకంటే వయసులో కొంచెం పెద్దవాడు . .. బస్సులో ఎక్కుతావా అని అడుగుతున్నాడు…
ఒకాటే. ఒకాటే? ఎక్కడికి ?….
ఇప్పటిదాకా వెనకపడ్డ ఆ పిల్లవాడేడి? కనపడ్డం లేదే, ఎక్కడికి పోయాడు? అంతలో ఎలా మాయమయ్యాడు? ఇదే బస్సులో ఎక్కాడా?
“వస్తావా? రావా? తొందరగా చెప్పు , ఎక్కడికెళ్ళాలి”? ఆ నల్లటి లావుపాటి అబ్బాయి మళ్ళీ అడిగాడు.
“వస్తానొస్తాను.”
“సరే ఎక్కు! ఎక్కడికెళ్ళాలి”?
“రోషపల్”
“కూర్చోడానికి స్థలం లేదు . నిలబడాలి. “
“పర్లేదు. నిలబడతాను.”
క్లీనరు ఆమె గుడ్డసంచీ చేతిలోకి తీస్కున్నాడు. గుండెలకదుముకున్న పొట్లం వైపు విచిత్రంగా చూసి అడిగాడు’
“ ఏవుంది, దాంట్లో బంగారమా ?”
“ఎదో ఒకటి . నీకెందుకు” కసిరింది సుభాషిణి.
సుభాషిణిని బస్సెక్కించి క్లీనర్ బస్సు పక్క భాగాన శబ్దం వచ్చేట్లుగా రెండు సార్లు చరిచాడు . డ్రైవరు ఆ శబ్దం విని, గేరు మార్చి, బస్సును ముందుకు పోనిచ్చాడు. బస్సులో ఆ పిల్లవాడు కనపడతాడేమోనని సుభాషిణి తల తిప్పి చూసింది. ఎక్కడా లేడు. కిటికీలోంచి బయటికి చూద్దామంటే బస్సు అంతా జనం తో నిండి పోయుంది. కొంచెం కష్టం.
ఆ ప్రయత్నం మానేసి , సుభాషిణి ఊపిరి పీల్చుకుంది. “ఇంక జిలెబీలు నా కూనారామ్ కే”
——————
బస్సు సుభాషిణిని రోషపల్ స్కూల్ బిల్డింగ్ ముందర వదిలేసింది. అక్కణ్ణించీ భారంగా అడుగులేసుకుంటూ తన గుడిసె వైపు బయలు దేరింది. . గుడిసె దగ్గరకొచ్చి చూస్తే అక్కడే సగం ఊరంతా ఉన్నట్లనిపించింది. పాటా , ఆమె పిల్లలు. చుట్టుపక్కల ఇళ్లల్లో వాళ్ళు అందరూ ఇంటిలోపలికి బయటికి వస్తూ, గొంతులు పెద్దవి చేసి ఆదుర్దాగా మాట్లాడుకుంటున్నారు. ఏమయ్యింది ? ఏమి జరుగుతోంది? పరుగు పరుగున ఇంటికి చేరుకుంది . నిలుమోని ఏమీ మాట్లాడకుండా వచ్చి సుభాషిణిని కరుచుకుని వెక్కి వెక్కి ఏడవడం మొదలు పెట్టింది. అక్కడున్న ఆడవాళ్లు ఒకసారి వాళ్ళిద్దరి వైపు చూసి, జుట్లు పీక్కుంటూ, పెడబొబ్బలు పెడ్తూ గుండెలు బాదుకుంటూ శోకాలు మొదలెట్టారు.
పాటా వచ్చి సుభాషిణిని దగ్గరకు తీసుకుంది.
“ఎంత పని జరిగిందమ్మా ! కూనూ వాళ్ళమ్మకి ఎంత కష్టం వచ్చిందమ్మా? “
అందరు ఆడవాళ్ళూ ఒకే గొంతుతో స్వరం హెచ్చించి అంటున్నారు
“ఎంత పని జరిగిందమ్మా. ఓ భగవంతుడా ఎంత పని చేసావు. అంతా నాశనం సర్వ నాశనం.”
పాటా గుడిసె గోడకి తలనేసి బాదుకుంటోంది. లోపలి పరిగెత్తింది సుభాషిణి. కూనూ మంచం మీద అలానే వున్నాడు . పొద్దున తాను వాణ్ణి ఎలా చూసిందో అలానే, కళ్ళు మూసుకుని.
నిద్ర.. నిద్ర పోతున్నాడు.. . అవును వాడు నిద్ర పోతున్నాడు…. కాదా ? నిద్ర పోతున్నాడు . అవును .
వాడిప్పుడు ఈ శబ్దాలకు లేచి ఒక్క ఉదుటున లేచి ఎదురుగా వున్న వాళ్ళమ్మను చూస్తాడు. అమ్మా. వచ్చేసావా.. జిలెబీలు ఏవి ..తెచ్చావు గదా..
అలాంటిది ఏవీ జరగలేదు. కూనరామ్ బయటి రొదతో సంబంధం లేదన్నట్టుగా కదలిక లేకుండా కళ్ళు తెరవకుండా అలానే వున్నాడు. మూలుగు లేదు. పలవరింతలు లేవు. ఆఖరికి శ్వాసిస్తున్నట్టుగా శబ్దం కూడా లేదు.
“వాడు జిలెబీలు జిలెబీలు అని అడుగుతూనే వున్నాడమ్మా!” అని అరుస్తూ పారుల్ వాళ్ళమ్మని వెనకనించి వచ్చి చుట్టేసుకుని ఏడుస్తోంది.
“‘వాడు నీకోసం ఎదురు చూస్తూనే వున్నాడు.”
ఉబికిన కన్నీళ్లు నిప్పుకణికలై మండిస్తున్నాయి ఆమె కళ్ళను. కాగితపొట్లం కిందపడి, విడివడి పోయి. .. ఎంతో ప్రేమతో తెచ్చిన జిలెబీలు చెల్లా చెదురు అయ్యాయి.
గుండెల్లో పెట్టుకుని తెచ్చినవి…. ఆకలితో వున్న ఓ పసివాడు అడిగితే కూడా, ఇవ్వక దాచుకుని తెచ్చినవి.
( కథ ఆంగ్ల మూలం – https://ur.booksc.eu/dl/28680189/d870eb)
——————
****ఆశ – ఆశంక అనే ఈ కథ డాక్టర్ సౌవేంద్ర శేఖర్ హన్సడా గారు రాసిన ఆంగ్ల కథా సంపుటం ‘The Adivasi will not dance’ నించి స్వీకరించబడిన ‘Desire, Devination, Death’ అనే కథకు తెలుగు అనుసరణ . ఈ పుస్తకం ‘ Speaking Tiger Publications’ ద్వారా ప్రచురింపబడింది. 2015 సంవత్సరానికి ఈయన కేంద్ర సాహిత్య అకాడెమి యువ పురస్కారం గెలుచుకున్నారు. వృత్తిరీత్యా ప్రభుత్వ వైద్యులు. అనుసరణకు అనుమతినిచ్చినందుకు వారికి కృతజ్ఞతలు.
Leave a Reply