మెకానికల్ ఇంజనీరింగ్ చదువుకున్న శ్రీ కణ్ణన్ సుందరం ప్రసిద్ధ తమిళ రచయిత సుందర రామస్వామి గారి కుమారుడు. కాలచ్చువడు పబ్లికేషన్స్ అనే సంస్థను నాగర్ కోయిల్ పట్టణంలో స్థాపించి గత పాతికేళ్ళుగా విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఇప్పటిదాకా వెయ్యికి పైగా పుస్తకాలను ప్రచురించారు. తమిళ సాహిత్యానికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా అనేక అవార్డులు అందుకున్నారు. 2021 సంవత్సరంలో ఫ్రాన్స్ ప్రభుత్వం ఆయనకు చెవాలియర్ అవార్డును ప్రదానం చేసింది. ఈ సంభాషణలో భాగంగా , పుస్తక ప్రచురణ గురించి, పుస్తకాలను పాఠకులకు దగ్గరగా చేర్చడం గురించి, ప్రచురణ రంగంలో వస్తున్న అనేక మార్పుల గురించి, యువతకు పుస్తకాలపై ఆసక్తి గురించిమాట్లాడారు. ఈ సంభాషణ ఇంగ్లీష్ లో పాడ్కాస్ట్ చేయటం జరుగుతోంది.

Leave a Reply